ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ రూ. 90లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
షాద్నగర్, ఫిబ్రవరి12: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను వందశాతం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి, కిషన్నగర్, పీర్లగూడ, మొండోనిరాయి తండా, కంసాన్పల్లి, గిరాయిగుట్టతండా, వెంకట్రెడ్డిపల్లి, భీమారం, ఉప్పగడ్డ, చించోడ్, చౌలపల్లి, మొగిలిగిద్ద, రంగంపల్లి, ఎలికట్ట గ్రామాల్లో పర్యటించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. 16 గ్రామాల్లో రూ. 90 లక్షల నిధులను వెచ్చించి నూతనంగా సీసీ రోడ్లను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఫరూఖ్నగర్ మండలంలో రూ. 1.84 కోట్ల నిధులతో సీసీ రోడ్లను నూతనంగా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. భీమారం గ్రామంలో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. రూ. 12 లక్షల నిధులతో రంగంపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం, చౌలపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు బెంది శ్రీనివాస్రెడ్డి, మన్నె నారాయణ, దామోదర్, కృష్ణయ్య, శ్రీశైలం, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.