యాచారం, జూలై19: యాచారం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న మమతాబాయిని బదిలీ చేయొద్దని, ఆమె హయాంలో మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయని మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు అత్యవసర సమావేశంలో ముక్తకంఠం విని సిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అంతకు ముందు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోను బదిలీ చేయాలంటూ సోమవారం ఎంపీపీ కొప్పు సుకన్య అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 11గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశానికి ఎం పీపీ సుకన్యతో పాటుగా ఎంపీడీవో మమతాబాయి, మొండిగౌరెల్లి ఎంపీటీసీ లక్ష్మమ్మ, చౌదర్పల్లి ఎంపీటీసీ రాజేందర్రెడ్డి, మంథన్గౌరెల్లి ఎంపీటీసీ కొర్ర జ్యోతిలు హాజరయ్యారు. ఉదయం 11.30వరకు 14మంది ఎం పీటీసీలకుగాను నలుగురు మాత్రమే హాజరుకావడంతో పూర్తి స్థాయి కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తు న్నట్లు ఎంపీపీ సుకన్య ప్రకటిస్తూ సమావేశం మందిరం నుంచి వెళ్లి పోయారు.
ఆమెతో పాటు మిగతా ముగ్గురు ఎంపీటీసీలు సైతం వెళ్లి పోయారు. 11.30గంటల తరు వాత జడ్పీటీసీ జంగమ్మతో పాటుగా ఆరుగురు టీఆర్ఎస్ ఎంపీటీసీ లు, 24మంది సర్పంచ్లకుగాను 18 మంది సర్పంచ్ లు సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కోరం లేనప్పుడు సమా వేశాన్ని గంటపాటు వాయిదా వేయాలని అనంతరం సమావేశాన్ని తిరిగి కొనసాగించాలని సభ్యులు పట్టు బట్టారు. దీంతో 12.30కు తిరిగి సమావేశాన్ని మళ్లీ ప్రారంభించారు. ఎంపీపీ సుకన్యతో పాటు వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి సమావేశానికి హాజరుకాకపోవడంతో 14మంది ఎంపీటీసీలకు గాను 1/4వంతు మెజారిటీ కోసం 5 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండాలి. సమావేశంలో 6 మంది టీఆర్ఎస్ ఎంపీటీసీలు ఉండటంతో కోరం సరిపోయింది. మండల పరిషత్ చరిత్రలోనే తా త్కాలిక అధ్యక్షురాలిని ఎన్నుకొని సమావేశాన్ని నడిపించడం ఇదే తొలిసారి.
ఎంపీడీవోను బదిలీ చేస్తే ఊరుకునేదిలేదని మహిళా సర్పంచ్లు ఉదయశ్రీ, కవిత, సంతోష, విజయలక్ష్మి పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తే ఇక్కడ పనిచేయడానికి ఎవరూ ముందుకురారన్నారు. ఎంపీపీ సుకన్య చేతగాకపోతే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఎంపీటీసీలు సుమత మ్మ, శివలీల, ఇస్రత్బేగం పట్టుబట్టారు. ప్రజాప్రతి నిధులు, అధికారులు కలిసి పనిచేస్తూ మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని పీఏసీఎస్ చైర్మేన్ రాజేందర్రెడ్డి సూచించారు. ఎంపీపీ సుకన్య అధికారులు తన మాట వినడంలేదని తరుచూ ప్రొటోకాల్ పేరుతో వివాదాలు సృష్టిస్తున్నారని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ వాపోయారు. గతం లో ఎమ్మెల్యేపై ప్రొటోకాల్ పంచాయతీ చేశారని గుర్తు చేశారు. నిజాయితీగల ఎంపీడీవోను రాజకీయం చేస్తుందనడం సరి కాదని మండిపడ్డారు. అధికారులను వేధించడం మానుకోవాలన్నారు. జడ్పీటీసీతో పాటు సర్పంచ్లు, ఎంపీటీ సీలు ఎంపీడీవో మమతాబాయిని బదిలీ చేయొద్దని స్పష్టం చేశారు.