చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రం ల్యాండర్ దిగగానే విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబురాలు చేసుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను పలువురు అభినందించారు. టీవీలలో తిలకించేందుకు పాఠశాలల విద్యార్థులను 45 నిమిషాల ముందుగానే పంపించారు.
ఇండ్లల్లో జనం టీవీల్లో చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ ఘట్టాన్ని తిలకించారు. వికారాబాద్ పట్టణంలోని శివరాంనగర్ కాలనీలో కౌన్సిలర్ గాయత్రీ లక్ష్మణ్ బుధవారం శ్రీవివేకావాణి విద్యాలయ ఆవరణలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి కాలనీవాసులకు చూపించారు.
– వికారాబాద్/బొంరాస్పేట, ఆగస్టు 23