Rajanna-siricilla
- Jan 17, 2021 , 03:47:15
VIDEOS
నలుగురి అదృశ్యంపై ఫిర్యాదు

ఎల్లారెడ్డిపేట, జనవరి 16: వీర్నపల్లి మండ లం ఎర్రగడ్డకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అదృశ్యంపై వారి కుటుంబీకులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఎర్రగడ్డకు చెందిన సంగీబాయి (55) తన భర్త శ్రీరాములుతో గొడవ పడి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తన పెద్ద కూతురు మంజుల ఇంటికి గత నెల 30న తన మరో కూతురు వినోద (దివ్యాంగురాలు), కొడుకు శ్రావణ్, మనుమరాలు సాహితి (మంజుల కూతురు)తో కలిసి వెళ్లింది. ఈ నెల 2న రాత్రి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మంజుల ఇంటి నుంచి వీరందరితో బయటకు వెళ్లింది. ఉదయం నిద్రలేచిన మంజుల గమనించి తన తండ్రి శ్రీరాములుకు సమాచారం అందించింది. వీరిద్దరూ ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం రాత్రి శ్రీరాములు ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు
- బ్లాక్ డ్రెస్లో రాశీ ఖన్నా గ్లామర్ షో అదిరింది...!
- ‘మోదీ ఫొటోలను తొలగించండి’
- బిల్డింగ్పై నుండి కింద పడ్డ నటుడు.. ఆసుపత్రికి తరలింపు
- శ్రీగిరులకు బ్రహ్మోత్సవ శోభ.. నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
- ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పిక్ లీక్..!
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
MOST READ
TRENDING