తాండూరు, మార్చి 17: మార్చిలోనే సూర్యుడు తన విశ్వరూపాన్ని ప్ర దర్శి స్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వేసవిలో మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు తీవ్ర రూ పం దాల్చాయి. గత రెం డు రోజుల నుంచి జిల్లా లో ఒక్కసారిగా ఊష్ణోగ్రతలు క్రమేణా పెరిగాయి. తాండూరు నియోజకవర్గంలో కూడా నాపరాళ్ల గనులు ఉండడంతో ఈ ప్రాంతంలో ఎండలు మ రింత తీవ్రంగా ఉన్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరగడం గమనార్హం. బుధవారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.3, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.7 నమోదైంది. దీంతో మూగ జీవాలు కూడా దాహార్తితో తల్లడిల్లిపోతున్నాయి. ప్రజలు చెంతనే ఉన్న జ్యూస్ సెంటర్లు, ఇతరత్రా పానీయాల విక్రయ కేంద్రాల వైపు పరు గులు పెడుతూ తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో తాం డూరు పట్టణంలోని రోడ్లు నిర్మాణుష్యంగా కనిపిస్తున్నాయి. తప్పని సరి పరిస్థితిలో పనులకు వెళ్లవలసి వచ్చినప్పుడు రక్షణగా టోపీలు, గొడుగులు, కండువాలు తలపై కప్పుకొని బయటికి వస్తున్నారు. నియోజక వర్గంలోని పలు గ్రా మాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో గల నాపరాళ్ల క్వారీలు, సుద్ద గనులు, నాపరాళ్ల పాలిషింగ్ యూనిట్లు ఉండడంతో తాండూరు పట్టణ పరిసరాల్లో వేడి మరింత అధికంగా ఉం టోంది. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు పట్టణంలోని వేడిని తట్టుకోలేక బాబోయ్ తాండూరులో ఇంత ఎండలా అం టూ ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలో వికారాబాద్ పట్టణంతో పోలిస్తే తాం డూరు ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నది. వికారాబాద్ ప్రాంతంలో అనంతగిరి కొండలు ఉండడంతో అక్కడ తాండూరు కన్నా తక్కువగా నమోదవుతున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు ఆరోగ్య నియమాలు పాటించాలి. అత్యవస రం అనుకుంటే తప్ప బయటకు వెళ్లకూడదు. తప్ప నిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, లేదా నెత్తిన తెల్లటి బట్ట వేసుకొని వెళ్లాలి. ఎక్కువ నీరు తాగాలి. వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ, నిమ్మ రసం తాగాలి. వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. గర్భిణులు, బాలిం తలు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగా యలు, పండ్లు తీసుకోవాలి. వాంతులు, అలసట, తలనొప్పి, కండరాల్లో తిమ్మిరులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచింది.