బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవంలో కళాకారుల కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.