నల్లగొండ : తిప్పర్తి మండల కేంద్రంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఆదివారం సాయంత్రమే వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. రాత్రి వరకు పలు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వీధుల్లో పారిశుధ్య పనులను పరిశీలిస్తూ మొక్కల పెంపకాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు. రాత్రి గ్రామంలోని రైతువేదిక భవనంలో పల్లె నిద్ర చేసారు. తిరిగి సోమవారం ఉదయం గ్రామంలో పర్యటించారు.
అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకుంటూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సీసీ రోడ్స్, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేసారు. మరిన్ని అభివృద్ధి నిధులు వెచ్చిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఎంపీపీ ఎన్. విజయలక్ష్మి , స్థానిక సర్పంచ్ రొట్టెల రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ వీళ్లే