తమ లోపాలు మరచి, ఇతరుల తప్పులను ఎత్తిచూపుతూ, పీడించుకు తినేవారిని ఉద్దేశించిన సామెత ఇది. ఎంత కాషాయ వస్ర్తాలు ధరించినా తోడేలు తోడేలే. హింసించడం దాని లక్షణం. పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. ఎన్ని వేషాలు వేసినా, ఎంతలా నమ్మించే ప్రయత్నాలు చేసినా.. ఆ సహజ స్వభావం పుర్రె కాలే వరకూ పోదు. ఈ సామెత నేటి కేంద్ర ప్రభుత్వ పాలకులకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేద, సామాన్య ప్రజానీకాన్ని జీఎస్టీ పేరుతో పీడిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల ముందు ‘మేకవన్నె పులి’లా నటించి.. ఇప్పుడు నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నది. తెలంగాణ ప్రభుత్వం.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెడుతున్న పథకాలకు ప్రజల నుంచి మన్ననలు వస్తుండటంతో జీర్ణించుకోలేకపోతున్నారు బీజేపీ పెద్దలు.