‘ఎహే.. వాడొట్టి కయ్యాలమారోడు. గిచ్చి కయ్యం పెడ్తడు. నలుగుట్ల గిచ్చి జోలపాడ్తడు’ అంటుంటారు. ఈ పదబంధం తెలంగాణలోని ప్రతిపక్ష నాయకులకు సరిగ్గా సరిపోతుంది. మొదటినుంచీ అంతే. వీళ్ల తీరు గిచ్చి జోల పాడినట్టు ఉంది. వట్టిగా ఉన్నోని దగ్గరకు పోయి.. గిచ్చి మరీ కయ్యం పెట్టుకుంటున్నారు.
చివరికి వాళ్లే ఏమీ ఎరుగనట్లు జోలపాడుతున్నారు. సజావుగా సాగే పదో తరగతి పరీక్షల్లో.. పిల్లల భవిష్యత్ను ఆలోచించకుండా.. లీకేజీలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కయ్యం పెట్టి.. ఆ మంటల్లో చలికాగారు. చేయాల్సిందంతా చేసి, మళ్లీ తమకేమి ఎరుగనట్లు సుద్దపూసల్లా ప్రజల్లో తిరుగుతున్నారు. గిచ్చేది వాళ్లే.. గిల్లేది వాళ్లే.. కయ్యం పెట్టేది వాళ్లే.. నేరం రుజువుకాగానే తమ తప్పేమి లేదంటూ బుకాయించేదీ వాళ్లే.