బలవంతంగా నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆ ప్రయత్నాలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం వారిని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. అదే సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు వివిధ చట్టాలను సవరిస్తున్నాయి.
2023 ఫిబ్రవరి 22న కర్ణాటక ప్రభు త్వం ఫ్యాక్టరీల చట్టం (కర్ణాటక సవరణ)-2023 సవరణ బిల్లును ఆమోదించింది. మన దేశంలో నిత్యం శ్రామికులపై జరుగుతున్న దాడికి ఇది ఉదాహరణ. పాలక పక్షం కొన్ని బిల్లులను ఆమోదించాలని నిర్ణయించిన తర్వాత, కొంతమంది సభ్యులు వ్యతిరేకించినా అది ఆమోదించబడుతుంది. ఈ కొత్త చట్టం పూర్తిగా కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల స్వభావాన్ని కలిగి ఉన్నది. రోజువారీ పని గంటలను 9 నుంచి 12 గంటలకు పెంచాలని, గరిష్ఠంగా వారానికి 48 గంటలు పనిచేయాలని బిల్లులో ఉన్నది. ఈ బిల్లును సమర్థిస్తూ, కర్ణాటక న్యాయశాఖమంత్రి శాసనసభలో మాట్లాడు తూ ‘రోజుకు 12 గంటలు పనిచేయడం తప్పనిసరి కాదు, అయితే యజమాని, ఉద్యోగి పరస్పరం అంగీకారంతోనే ఇది అమలవుతుంది. ఏ కార్మికుడైనా 48 గంటలపాటు వరుసగా నాలుగు రోజులు పనిచేస్తే అప్పుడు కార్మికుడు జీతం తో మూడు రోజుల వీక్లీ ఆఫ్ పొందుతార’ని వెల్లడించారు. కార్మికులు, యాజమాన్యం పరస్పర అంగీకారమనేది సాధ్యం కాదన్నది కార్మికులందరికీ బాగా తెలుసు. చట్టం నిజమైన ఉద్దేశం కార్మికులను రోజుకు 12 గంట లు పని చేయమని చట్టబద్ధంగా బలవంతం చేయడమేనన్నది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. అలా చేస్తే కంపెనీలు కార్మికులకు రెట్టిం పు వేతనాలు చెల్లించాలి. కానీ ఈ చట్టం వల్ల కంపెనీలకు ప్రయోజనం చేకూరడమే కాకుం డా కార్మికుల ఓవర్టైమ్ వేతనాలు తగ్గించబడుతాయి.
కర్మాగారాలు, కార్యాలయాల్లో మహిళలను రాత్రి షిఫ్టులలో పనిచేసేందుకు కూడా చట్టం అనుమతిస్తుంది. సాధారణంగా, మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు, వారి పరిరక్షణకు సంబంధించి చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని మంత్రి అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ఈ సవరణను కోరడానికి అసలు కారణాలను మంత్రి వెల్లడించారు. ‘మహిళలకు పని గంటలపై పరిమితులున్నాయి. దీ న్ని సడలించాలని సాఫ్ట్వేర్ పరిశ్రమతో సహా ప్రతిచోటా ప్రభుత్వంపై చాలా ఒత్తిడి వస్తున్నది. మహిళల భద్రతపై కర్ణాటక ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను నిరూపించుకోవడానికి చట్టంలో కొన్ని నిబంధనలు చేశారు. దాని ప్రకారం, యజమాను లు సరైన భద్రత చర్యలు తీసుకుంటే మహిళలు రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల మధ్య పని చేయవచ్చు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపు చర్యలను నిరోధించడం యజమాని లేదా కంపెనీ బాధ్యుల విధి అని చట్టం నిర్దేశిస్తున్నది. రాత్రి షిఫ్టులలో పనిచేసే మహిళా కార్మికులకు వారి ఇండ్ల నుంచి కంపెనీకి, కంపె నీ నుంచి ఇంటికి వెళ్లి రావడానికి యజమానులు రవాణా సౌకర్యాన్ని కల్పించాలి. ఆ రవాణా వాహనంలో సీసీ టీవీ, జీపీఎస్ అమర్చాలని స్పష్టం చేశారు.
ఈ నిబంధనలన్నీ మాటలకు మాత్రమే పరిమితం. మహిళలపై హింస పెరుగుతున్న నేపథ్యంలో, పగటిపూట కూడా మహిళలు తమ పని ప్రదేశాల్లో సురక్షితంగా లేరన్నది వాస్తవం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా, ఇతర అధికారిక నివేదికల ప్రకారం.. కర్ణాటకలో మహిళలపై నేరాలకు సంబంధిం చి నమోదైన కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13,828 కాగా, 2021 నాటికి 14, 468కి పెరిగింది. కొత్త చట్టం మొత్తం లేదా కార్మికులకు, మహిళా కార్మికులకు ప్రయోజనం చేకూర్చేది కాదని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. దీని ఏకైక ఉద్దేశం పురుషులు, మహి ళా కార్మికులపై పెరిగిన దోపిడీని చట్టబద్ధం చేయడం. ఈ నాలుగు లేబర్ కోడ్లను అమలుచేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూనే, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యల పట్ల కార్మికులు జాగ్రత్త వహించాలి.
ఆళవందార్ వేణుమాధవ్
86860 51752