Language may comprise a few syllables, symbols and sounds.It may be used as a medium of expression of views, opinions and thoughts of one person to the other. But it represents the culture and lifestyle of the people of that language. It’s not only unites the people but also gives a style statement of those people, how they are different, unique and special from other fellow beings. Language is the invisible attire of the People, which makes it distinct from others.
ప్రపంచంలో భాషలన్నీ రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి. ఒకటి మౌఖిక భాష! రెండవది లిఖిత భాష! ఈ రెండింటిలో పరిణామ క్రమంలో మౌఖిక భాష స్థానమే మొదటిది! మానవుడు తన మనోభావాలను భావోద్వేగాలను తన తోటి మానవులతో పంచుకునే నేపథ్యంలో వివిధ రకాల అరుపులూ, కేక లూ (Shouts) (Screams), సంకేతాల (Symbols) ద్వారా వ్యక్తం చేయడం అనే ప్రక్రియ నుంచి మౌఖిక భాష పుట్టింది. మౌఖిక భాష లిఖిత భాషగా రూపాంతరం చెందడానికి వేలాది సంవత్సరాల పరిణామం ఉన్నదని భాషావేత్తలు అందరూ నిర్ధారించిన సత్యం. అయితే ప్రపంచం మొత్తమ్మీద ఇలా భాష మౌఖిక సంప్రదాయంలో మొదలైనప్పటికీ ఆ తర్వాత లిఖిత రూపాన్ని సంతరించుకోవడం ద్వారా తర్వాత తరం వాళకు ఆ భాషను కొనసాగించే సౌలభ్యం ఏర్పడింది. లిఖిత భాష రూపొందడం వెనుక ప్రతి పదం ఉచ్చారణ, (Pronunciation) నోటి ద్వారా కలిగే ధ్వని (Sounds generated through mouth), దానికి వివిధ రకాల లిఖి త సంకేతాల ద్వారా చెప్పే విధానం మొదలైంది. వీటిని ప్రాతినిధ్య సంకేతాలు (Representati ve symbols) అంటారు. లేదా సంకేతాత్మక లిపి (Symbolic Script)అనవచ్చు. అది ఒక్కో భాషలో ఒక్కో తీరుగా వచ్చిందనేది ఇక్కడ గమనించాలి. పదోత్పత్తి అధ్యయనాలు (Etymo logical Studies), భాషాశాస్త్రం (Philolo gy), భాషా పరిణామ శాస్త్ర (లింగ్విస్టిక్స్) పరిశీలనలను అనుసరించి పదాలను రాసే విధానాన్ని లోతుగా పరిశీలిస్తే ఒక్కో ప్రాంతంలో ఆయా భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను అనుసరించి లిపి ఒక్కోరకంగా ఉంటూ వచ్చిందనే వాస్తవం వెల్లడవుతున్నది.
లిపి పరిణామం, లిపిని రాసే విధానంలోని పరిణామాన్ని గమనిస్తే అది ఈ కింది రకాలుగా ఉన్నదని అర్థమవుతుంది.
1. చిత్ర లిపి సంకేత లిపి. లిపిలోని అక్షరాలు, వర్ణాల ఆకృతి, చిత్రణల ఆధారంగా.
2.లిపిని రాసే విధానాన్ని బట్టి (ఎడమ నుంచి కుడికి) (కుడి నుంచి ఎడమకు) నిలువుగా సింధు, ఈజిప్షియన్, సుమేరియన్, చైనా నాగరికతల కాలపు లిపి చిత్రలిపి (pictographical Script)తో మొదలైందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తున్నది.
అరబిక్, పర్షియన్, ఉర్దూ లాంటి భాషలు కుడివైపు నుంచి ఎడమవైపు రాసే విధానాన్ని కలిగి ఉన్నాయి. భారతీయ భాషలు ఎడమవైపు నుంచి కుడివైపు రాసే విధానానికి, అలాగే కంబోడియన్ భాష, జపనీస్ భాష లాంటివి నిలువుగా రాసే విధానానికి శ్రీకారం చుట్టాయి. ఇవి ఆయా భాషల పరిణామాలు, సందర్భాలు, పరిస్థితులను బట్టి జరుగుతూ వచ్చాయి.
ఈ క్రమంలో భారతీయ భాషల్లో ప్రామాణికంగా పేరెన్నికగన్న భాష తెలుగు భాష! ద్రావిడ భాషలలో ఒకటిగా తెలుగు భాష పుట్టుక గోండి భాష నుంచి మొదలైందనేది చాలామంది భాషావేత్తలు చెప్తున్నారు. ఇప్పటికీ గోండి భాష పదాలు, ఉచ్చారణ తెలుగు భాషకు సన్నిహితంగా ఉండటం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అలాగే బెలూచిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతపు బ్రాహుయీ భాష, దాని లిపి తెలుగు భాషకు దగ్గరగా ఉందనే విషయాన్ని కూడా చాలా పరిశోధనలు నిరూపించాయి. ఒక భాష ఒక ప్రాం తంలో మొదలైనప్పటికీ తర్వాత కాలక్రమంలో అది విస్తరిస్తూ ఇతర భాషలతో సంయోగం (Merger), వినిమయం చెందడం (exchange) ఇతర భాషల చేత ప్రభావితం (Influence) కావడం వల్ల అది రూపాంతరాలు చెందుతుంది అని దీన్నిబట్టి తేటతెల్లమవుతున్నది.
ఆ విధంగా తెలుగు భాష క్రీ.శ.940 ప్రాంతం లో పంపనకాలంలో ఒక నిర్దిష్టమైన సాహిత్య భాషగా లిఖిత రూపంలో మనకు కనిపించినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటివరకు పదకొండు వందల సంవత్సరాల కాలంలో తెలుగు భాష, తెలుగు లిపి, తెలుగు వర్ణమాల ఎన్నో పరిణామాలను దాటుకుంటూ వచ్చింది.
కొంచెం నిశితంగా ఆలోచిస్తే తెలుగు భాష, తెలుగు లిపి జినవల్లభుడి పూర్వపు శాసనకాలం నుంచి మనకు కనిపిస్తూ వచ్చినప్పటికీ పంపన కాలంలో, కవిత్రయ కాలంలో, ఆ తర్వాత పాల్కుర్కి సోమన, కుప్పాంబిక, బద్దెన, పోతన, శ్రీనాథుడు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన , మొల్ల, వేమన, రామదాసు నుంచి కాళోజీ , దాశరథి, డాక్టర్ సి.నారాయణరెడ్డి ఇలా ఎంతోమంది కవులు, సాహితీవేత్తల రచనల్లో తెలుగు భాష రకరకాల ప్రయోగాలకు నెలవైంది.
ఆ విషయానికి వస్తే మొదటినుంచి తెలుగు భాషలో రెండు రకాల రీతులు పక్కపక్కనే సమాంతరంగా నడుస్తూ వచ్చాయన్నది తెలుగు భాష పరిణామాన్ని అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది. మొదటిది మార్గ భాషా సంప్రదాయం అయితే, రెండోది దేశీ భాషా సంప్రదాయం. మార్గ సంప్రదాయంలో కవులు, సాహితీవేత్తలు తాళపత్ర గ్రంథాలపై మహా గ్రంథాలను, ప్రబంధాలను, కావ్యాలను రాయడం, అవి ప్రభు సమ్మతాలుగా ఉంటూ, రాజు ఆస్థానాల్లో పండితుల మధ్య చర్చల ద్వారా ప్రశస్తిలోకి వచ్చేవి. ఆ తర్వాతి తరాలకు ఆ లిఖితబద్ధమైన కావ్యాలూ అందుబాటులో ఉండటం వల్ల పరంపర కొనసాగింది. మరొకవైపున దేశీ గ్రామ్య భాష సామాన్య ప్రజల వాడుక భాష, పదాలతో కూడి ఉండి మౌఖిక సంప్రదాయంతో అలరారి, అది ఒక తరం నుంచి మరొక తరానికి పాటలు, గేయాల రూపంలో (ఉయ్యాల పాటలు, దంపుడు పాటలు, బతుకమ్మ పాటలు, జానపదాలు) వాడుకలో కొనసాగింది. మౌఖిక సాహిత్యం (Oral Literature) ద్వారా ఈ గ్రామ్య భాష తరతరాల నుంచి కొనసాగుతూ వచ్చింది.
ఈ రెండు సంప్రదాయాలలో తెలంగాణ భాష మొదటి నుంచీ దేశీ గ్రామ్య సంప్రదాయానికి దగ్గరగా ఉంటూ వచ్చింది. ఇంకా చరిత్ర పొరల్లోకి వెళ్లి తరచిచూస్తే ప్రాకృత భాషారీతులకు దగ్గరగా ఉం టూ వచ్చిందని అవగతమవుతున్నది. శాతవాహన కాలపు ప్రాకృత గ్రంథ సాహిత్యాన్ని తెలంగాణ భాషలోని పదాలు, ఉచ్చారణ, సరళములకు ప్రాధాన్యం వంటి అంశాలను గమనిస్తే ఈ విషయం ఇట్టే వెల్లడవుతున్నది. అలాగే తెలంగాణ ప్రాంతంలో తొలినాళ్ళలో జైనం, బౌద్ధ మతాల ప్రభావం, వాటి సాహిత్యాల ప్రభావం అధికంగా ఉండేది.
వేదాలలోని సంస్కృత భాషకు, పాండిత్యానికి భిన్నంగా ఈ మతాలు సామాన్య ప్రజాజీవనానికి, భాషకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, అధిక సంఖ్యాకులైన ఈ సగటు ప్రజలలో వాడుకలో ఉన్న దేశీ-గ్రామ్య సంప్రదాయ భాషలలోనే మత ప్రచారాన్ని చేశాయి. దానికోసం జైన, బౌద్ధ సాహిత్యాన్ని ప్రాకృతం వంటి ఇతర భాషల్లోనే రచించారు.
-డాక్టర్ మామిడి హరికృష్ణ