ప్రజాస్వామ్యంలో ఉండే అనుకూలాంశం పారదర్శకత. ఇది నిరంకుశ పాలనలో ఉండదు. ప్రజలకు వాస్తవాలను అందించి,నిర్ణయాలను తీసుకోవడంలో భాగస్వాములను చేసినట్టయితే, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలుస్తారు. సమాచారాన్నే ఆయుధంగా చేసుకునే నిరంకుశ పాలనలో ఇటువంటి ప్రక్రియ సాధ్యం కాదు. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో పారదర్శకత ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తాము ఎందుకు బాధపడవలసి వస్తున్నదో, ఈ బాధలను ప్రభుత్వం ఎందుకు నివారించలేదో తెలిసినప్పుడు, ప్రజలు ఆ బాధలో ఇష్టపూర్వకంగా పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు.
ఇక భారత్-చైనా ఘర్షణ సంగతికి వద్దాం. ఈ నెలలో రెండు దేశాల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. భారత సైనికులు కొందరు గాయపడ్డారు. అవతలి పక్షానికి కూడా గాయాలయ్యాయి. మూడు రోజుల తర్వాత లోపలి మనిషి ఒకరు మీడియాకు లోపాయికారిగా సమాచారమిచ్చేవరకు ఈ విషయా న్ని ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించలేదు. ప్రతిపక్షాలకూ తెలుపలేదు. సమాచారం బయటకు వచ్చిన తర్వాత ‘ఉన్నతస్థాయి సమావేశం’లో రక్షణమంత్రికి వివరిస్తున్నట్టు సమాచారం వెల్లడైంది. (రక్షణ మంత్రి సమావేశం ఉన్నతస్థాయి కాకపోతే మరే స్థాయిదై ఉం టుంది! ఈ ప్రభుత్వం ఏదో పెద్ద పదాలు వాడుతుంటుంది) ఘర్షణ జరిగిన రోజే రక్షణ మంత్రికి ఎందుకు వెల్లడించలేదు. కనీసం మరుసటి రోజైనా ఎందుకు చెప్పలేదు? ఈ విషయం మంత్రికి చెప్పాల్సినంత ప్రధానమైంది కాదని సైన్యం భావించి ఉంటుంది. ఇదే నిజమైతే, ఆందోళన కలిగించే విషయమే. ఘర్షణను విరమించుకునే విషయమై చర్చల సమాచారం రాజకీయ నాయకత్వం నుంచి సైన్యానికి చేరింది.
దీనిపై మొదటి సమావేశం జరిగితే, మరి రెండవ సమావేశం (పార్లమెంటు సమావేశం సాగుతున్న నేపథ్యంలో) మీడియా కోసమే జరిపినట్టు భావించాలి. ఇదే నిజమైతే హంగామా చేయడంలో తప్పేమీ లేదనుకోవచ్చు. ఒక మూడవ అంచనా. ఘర్షణ జరిగిన విషయం ప్రజలకు వెల్లడించాలని ప్రభుత్వం భావించలేదు. సమాచారం లీక్ కావడంతో కదలిక వచ్చింది. తనకు నియంత్రణ ఉందని చెప్పుకోవడానికి ఈ హం గామా చేసి ఉంటుంది. పారదర్శకత లేకపోవడంతో పాటు ఇది మరింత విచారకరమైన విషయం.
ఇటీవల బ్రిటిష్ పత్రిక ‘టెలిగ్రాఫ్’లో ఒక వార్త వచ్చింది. చైనాతో సరిహద్దు ఘర్షణలు ఏ మేర జరిగాయనేది భారత్ దాచి పెడుతున్నది. ప్రజల్లో భయాందోళనలు చెలరేగకుండా ఉండేందుకు ఈ రహస్యం పాటిస్తున్నది. చైనా సైన్యంతో తరచుగా సాగుతున్న ఘర్షణల విషయంలో మౌనం పాటించాలని ప్రభు త్వం సైనిక దళాలకు కఠినమైన ఆదేశాలు జారీచేసింది. ‘ఈ ఘటనల విషయం ఎవరికీ చెప్పకూడదని మాకు ఆదేశాలు వచ్చాయి. ఇందుకు కారణం రాజకీయమే.
చైనాతో సరిహద్దులో నెలకొన్న సంక్షోభాన్ని అల్పమైన విషయంగా చేయాలని బీజేపీ భావిస్తున్నది’ అని సైనికాధికారి ఒకరు చెప్పినట్టు ఆ పత్రికలో వచ్చింది. ప్రభుత్వం గోప్యం పాటించడం ఇది మొదటిసారి కాదు. ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. 2020 లో గాల్వాన్లో ఘర్షణ జరిగినప్పుడు ఎందరు మరణించారనేదే కాదు, భారత సైనికులు బందీలుగా ఉన్నారనీ, ఆ తర్వాత విడుదల అయ్యారనీ చెప్పలేదు. ఇప్పటివరకు ఈ ఘటనల గురించి సైన్యం మీడియా కు వెల్లడించలేదు. వ్యూహాత్మక స్వభావం గల ఈ ముప్పుపై ప్రభుత్వ స్పందన గమనించదగినది.
చైనా వాళ్ళు వాస్తవాధీన రేఖ దాటి వచ్చారా అనే ప్రశ్న వేయాలని బీజేపీ ఎంపీ ప్రయత్నించినప్పుడు, అనుమతి లభించలేదు. ఇది సున్నిత అంశం కనుక బహిరంగ పరచకూడదని ప్రభుత్వం సమర్థించుకున్నది. చైనాతో ఘర్షణల విషయంలో గోప్యత పాటించాలనే అభిప్రా యం ప్రభుత్వంలో పాతుకుపోయి ఉన్నది.
పశ్చిమాన (లఢాక్) తూర్పున (అరుణాచల్ప్రదేశ్) చైనాతో సరిహద్దు సమస్యాత్మకంగా ఉందని నాటి ప్రధాని నెహ్రూకు తెలుసు. సరిహద్దు రేఖలో కొన్ని చోట్ల నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా గీసినప్పటికీ, భారత పటంలో కనిపిస్తున్న సరిహద్దు రేఖను కాదంటే భారతీయులు అంగీకరించరని నెహ్రూకు తెలుసు. అందువల్లనే ఆయన తెలిసి కూడా దుందుడుకు వైఖరిని అవలంబించారు. క్షేత్రస్థాయిలో చెరిగిపోయినా, మన పటాలపై ఆ రేఖలు నిలిచి ఉన్నాయి. మాతృభూ మి రూపాన్ని ఇంతకాలం పటాలలో చూసిన మనం క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే కలవరపడతాం. 1962 యుద్ధం తర్వాత కూడా భారత్ ఈ గోప్యతను పాటిస్తున్నది. చైనాతో యుద్ధానికి సంబంధించిన నివేదిక మాదిరిగానే, నెహ్రూ పత్రాలను కూడా దాచిపెట్టారు.
అసలు యుద్ధం, సరిహద్దు వివాదం నేపథ్యం ఏమి టి? అనే విషయాలు తెలుసుకోవడానికి అవసరమైన సమాచారం కొంచెం బయటకు వస్తున్నది. విదేశాంగ శాఖకు చెందిన అవతార్సింగ్ భాసిన్ రాసిన తాజా పుస్తకం వాస్తవ దృశ్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నది. మనల్ని సమస్య నుంచి దూరంగా తీసుకుపోయి, గతానికి సంబంధించినవేవో కొన్ని వీడియో క్లిప్పులు చూపిస్తున్నారు. భద్రతా మండలిలో సభ్యత్వం రాకుండా నిరోధించారనీ, ఇస్తామన్నా తీసుకోలేదనీ పిట్టకథలు చెప్తున్నారు. ఇటువంటి జాతీయతావాదమే ఆరు దశాబ్దాల కిందట మనం నిర్ణయం తీసుకోలేకుండా అడ్డుకున్నది. ఇప్పటికీ అదే జరుగుతున్నది.
ప్రధానికి ప్రజల్లో బాగా పేరున్నది. అనవసరంగా అనేక కష్టనష్టాలు కలిగించినప్పటికీ, ఆయన పట్ల ప్రజలలో అభిమానం ఉన్నది. ఆయన బెదురులేని జాతీయవాదం నుంచే ఈ ప్రాచుర్యం లభించడమే విచి త్రం. పారదర్శకత ఇందుకు విరుద్ధమైనది. దీనివల్ల భారత్కు ప్రత్యామ్నాయాలు కుంచించుకుపోతున్నా యి. ప్రజాస్వామిక శక్తిని మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. కానీ మనం ఏది చూడగూడదని కోరుకుంటున్నామో, అది ఇంతకాలం మన కళ్లెదుట ఆవిష్కృతమవుతూనే ఉన్నది.
(వ్యాసకర్త: ఆకార్ పటేల్ కాలమిస్ట్, రచయిత) (రెడిఫ్.కామ్ సౌజన్యంతో)