సంగీత సామ్రాజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించి తనదైన శైలిలో అద్భుత పాటలతో ఆధ్యాత్మిక సినిమాలకు నిండుదనం తెచ్చిన సాహితీవేత్త, సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్.
1946, జనవరి 10 న తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, కేసముద్రం మండలంలోని కోమటిపల్లి గ్రామం లో రంగరాజ భట్టర్, రం గనాయకమ్మాళ్ దంపతులకు వేదవ్యాస రంగభట్ట ర్ జన్మించారు. 1968లో టీటీడీలోని ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య అధ్యాపకులుగా బోధన రంగంలోకి ఆయ న ప్రవేశించారు. సాహి త్య శాఖ అధ్యక్షుడిగా, ప్రిన్సిపాల్గా పనిచేసి 20 04లో ఉద్యోగ విరమణ చేశారు.
వేదవ్యాస రంగభట్టర్కు సినీ దర్శకుడు, రచయిత జేకే భారవి స్వయాన తమ్ముడు కావడం గమనార్హం. 1986లో తొలిసారి ఆయన ‘రంగవల్లి’ సినిమాకు పాటలు రాశారు. ఆ తర్వాత ‘శ్రీమంజునాథ’, ‘రామదాసు’, ‘పాండురంగడు’, ‘షిరిడీ సాయి’, ‘అనగనగా ఒక ధీరుడు’, ‘ఝుమ్మంది నాదం’, ‘ఓం నమో వెంకటేశాయ’ ఇలా దాదాపు 13 సినిమాలకు సాహిత్యం అందించారు. దాదాపు 80కి పైగా పాటలు రాశారు.
శ్రీ మంజునాథ చిత్రంలోని ‘మహా ప్రాణ దీపం’ పాట రంగభట్టర్కు మంచి పేరును తెచ్చింది. ‘స్వరజ్ఞాన వర్షిణి’ అనే కొత్త సాహిత్య సంగీత స్వర ప్రక్రియను రూపొందించి, వేంకటేశ్వరస్వామిపై 12, 16 స్వర స్థానాలతో 320 కీర్తనల వరకు రాశారు. 1996లో తిరుపతిలోని మహతి కళామందిరంలో ‘ఎస్వీ నట శిక్షణాలయం’ స్థాపించి ఔత్సాహిక కళాకారులకు పద్యపఠనం, పౌరాణిక నాటకాల్లో ఉచితంగా శిక్షణనందించారు. రోజా, సంఘవి వంటి నటీమణులకు కూడా నటనలో శిక్షణ ఇచ్చారు. అనేక నాటకాలను రాసి, వాటికి దర్శకత్వం వహించారు.
సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు గాను 2003లో ఏపీ ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. వివిధ సాహితీ, సాం స్కృతిక సంస్థల నుంచి కళాతప స్వి, దర్శకరత్న, కళారత్న, సాహితీ సార్వభౌమ వంటి బిరుదులను అందుకున్నారు. ఊపిరితిత్తుల వ్యాధికి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, ఫిబ్రవరి 20న ఆయన మరణించారు. రంగభట్టర్ రాసిన పాటలతో ప్రజల హృదయాల్లో ఆయన ఎన్నటికీ చిరస్మరణీయుడే.
సాయి లోహిత పులపా