హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసింది.
తెలంగాణ సమాజం యావత్తు కేసీఆర్ వెంట నిలవడంతో..కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సందర్భంగా అమెరికాలోని అట్లాంటా, న్యూజెర్సీలో నవంబర్ 29న ప్రత్యక్షంగా దీక్షక్షా దివస్లో పాల్గొననున్నట్టు మహేష్ బిగాల తెలిపారు.
ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తించి ప్రపంచ దేశాలలో దీక్ష దివస్ ని జరపాలని ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. అలాగే దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ అమరులకు అలాగే తెలంగాణ ఉద్యమ అమరులకు నివాళులు అర్పించాలని కోరారు.