మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయం అని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజు అన్నారు. మునుగోడులో ఈరోజు జరిగిన ప్రజాదీవెన సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పరిపాలనలో జరిగిన అభివృద్ధి తెలుసునని ఆయన అన్నారు. అలాగే నల్గొండ జిల్లాకు వస్తే మునుగోడు నియోజకర్గం ప్రజలు ఒకనాడు ఫ్లోరైడ్ నీళ్ల వల్ల నడుములు వంగిపోయి.. ఏ విధంగా బాధపడ్డారో కేసీఆర్ కళ్లారా చూసారని, అందుకే ఈ జిల్లా జీవన్మరణ సమస్యగా మారిన ఫ్లోరైడ్ రక్కసిని పారదోలారని నాగరాజు తెలిపారు.
ఈ మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన.. ‘‘కేసీఆర్ చేసే అభివృద్ధి, సంక్షేమం చాలు మునుగోడులో టీఆర్ఎస్ గెలవడానికి, కేసీఆర్ అన్నట్టు కాంగ్రెస్ ఉన్నా లేకున్నా ఒక్కటే, బీజేపీ దేశానికే ఏమి చెయ్యట్లేదు, అధికారంలో లేని రాష్ట్రానికి ఏమన్నా చేస్తది అని నమ్మే స్థితిలో ప్రజలు లేరు, మునుగోడు ప్రజలు అన్ని గమనిస్తూ రాబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్కి పట్టం కడుతారు’’ అని తెలియజేశారు. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ తరపున ప్రచార వివరాలను కొద్దీ రోజులలో తెలియజేస్తామని చెప్పారు.