హైదరాబాద్ : రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక కేసీఆర్ కుటుంబంపై పిచ్చి రాతలు రాస్తున్న తీన్మార్ మల్లన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజు డిమాండ్ చేశారు. నాయకులను, ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడమే మల్లన్న లక్ష్యంగా పెట్టుకున్నారని, ఎంతో మందిని బెదిరించారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు.. ఇలాంటి చిల్లర వ్యక్తిని పార్టీలో చేర్చుకునే ముందు ఆలోచించాలి. తీన్మార్ మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.