హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలను టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఖండించారు. ఆ ఆరోపణలు నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని తెలిసి.. టీఆర్ఎస్ నాయకులపై నిందలు మోపి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితపై బురదజల్లడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సరైన సమయంలో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారని మహేశ్ బిగాల స్పష్టం చేశారు.