మలేషియా : అనిల్ కుర్మాచలంకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సీఎం కేసీఆర్ నియమించడం పట్ల టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు చిరుత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిట్టి బాబుమాట్లాడుతూ .. అనిల్కు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం ఉద్యమకారుడికి దక్కిన గౌరవం అని పేర్కొన్నారు.
అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్త స్వదేశంలో ఉన్నా.. లేదా విదేశాలలో ఉన్నా సరైన సమయంలో సముచిత స్థానం కల్పిస్తారనడానికి ఇది ఒక మంచి ఉదహారణగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ మలేషియా పక్షాన ప్రత్యే కృతజ్ఞతలు తెలిపారు.
కార్య క్రమంలో టీఆర్ఎస్ మలేషియా ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావు నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవీందర్ రెడ్డి , హరీష్ గుడిపాటి, నవీన్ పాల్గొన్నారు.