హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆన్లైన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు ఆదిశంకర విరచిత గణేశ్ పంచరత్న స్తోత్ర భాష్యం చెప్పనున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి (సింగపూర్ కాలమానం ప్రకారం) యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది.