Club Dubai World Series | సంక్రాంతి పండగ సందర్భంగా జనవరిలో `శ్రీ సాంస్కృతిక కళాసారథి` ఆధ్వర్యంలో నిర్వహించిన `మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ (MFCL)` టోర్నీలో ఉత్తమ క్రికెటర్లు ముగ్గురు తెలుగు కార్మిక సోదరులు ఎంపికయ్యారు. వారిని ఈ నెల 24-29 మధ్య దుబాయిలో జరిగే క్లబ్ వరల్డ్ సిరీస్-ఇండోర్ క్రికెట్ టోర్నమెంట్కు సింగపూర్ ఇండోర్ క్రికెట్ అసోయేషన్ (Indoor Cricket Association, Singapore – ICA) తరఫున పంపుతున్నారు.
అలా ఎంపికైన వారిలో పినకాన తులసీరామ్, సీడీ దిలీప్ వరప్రసాద్, అక్కరమణి గణేశ్ కుమార్ ఉన్నారు. టీం కెప్టెన్గా రామ్ మడిపల్లి వ్యవహరించనున్నారని సింగపూర్ ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మురళీధరన్ గోవిందరాజన్, శంకర్ వీర తెలిపారు.
`మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ (MFCL)`లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ముగ్గురు ఆటగాళ్ళు దుబాయి ఇండోర్ క్రికెట్ సిరీస్కి ఎంపిక అవ్వడం పట్ల టోర్నమెంట్ నిర్వాహుకులు గిరిధర్ సారాయి, నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, ఎస్ కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
దుబాయి క్లబ్ వరల్డ్ సిరీస్ టోర్నీకి ఎంపికైన క్రికెటర్లను శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అభినందించారు. వారు ఈ టోర్నీలో కూడా జయ కేతనం ఎగురవేయాలని ఆకాంక్షించారు.
టోర్నమెంట్ మరిన్ని వివరములకు:
https://www.clubworldseries.com/