హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల (Paddy Procurement) వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీలో టీఆర్ఎస్ ఎన్నారైశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు.
ఆయా కార్యక్రమాల్లో ఆస్ట్రేలియా టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి, చెలుపాటి వినయ్ సన్నీగౌడ్, భరత్సింహారెడ్డి, ఉదయ్రెడ్డి, కృష్ణకాంత్, ప్రదీప్, గౌతం, శశాంక్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.