హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్(NT Ramarao) శత జయంతి ఉత్సవాలను సౌతాఫ్రికా(South Africa) ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ‘ శక పురుషుని శత జయంతి’ఉత్సవాల పేరిట రాజకీయాలకు అతీతంగా జరిగిన కార్యక్రమంలో తెలుగు ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం నాయకులు పారా రామకృష్ణ , కొమ్మినేని మురళికృష్ణ, లీలా లక్ష్మి తదితరులు రామారావు జీవిత విశేషాలను వివరించారు. రామారావు తెలుగు ప్రజలందరికీ(Telugu People) చిరస్మరణీయుడని, భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.
తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని ప్రపంచం నలుమూలల చాటిన మహనీయుడని అన్నారు. ఆయన జీవిత ప్రస్థానంలో ఉన్న మైలురాళ్లను వివరిస్తూ పలు వీడియో(Videos)లను ప్రదర్శించారు. శారద మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో చిన్నారులు ఎన్టీఆర్ చిత్రాల్లోని పలు గీతాలను(Songs) పాడి అలరించారు. జగదీశ్, నందిని జంట చేసిన డ్యాన్స్ మెడ్లి విశేషంగా ఆకట్టుకుంది.