ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్వేగాస్లోని ది మిరాగ్లో శనివారం జరిగిన ఆటా బోర్డు మీటింగ్లో ప్రస్తుత అధ్యక్షుడు భువనేశ్ భూజల నూతన అధ్యక్షురాలికి బాధ్యతలు అప్పగించారు. సమావేశానికి యూఎస్లోని ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.
నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నుంచి ‘ఆటా’లో చురుగ్గా ఉండడంతో పాటు సెక్రెటరీ, జా యింట్ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితర పదవుల్లోనూ సేవలందించారు. ఈ నెలలో ఆటాలోని 16 బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు నాలుగేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు.
అనిల్ బొద్దిరెడ్డి, సన్నీరెడ్డి, కిరణ్ పాశం, కిశోర్ గూడూరు, మహీదర్ ముస్కుల, నర్సిరెడ్డి గడ్డికొప్పుల, రామకృష్ణా రెడ్డి అల, రాజు కక్కెర్ల, సాయి సుధిని, శ్రీకాంత్ గుడిపాటి, నర్సింహారెడ్డి ధ్యాసాని, రఘువీర్ మరిపెద్ది, సాయినాథ్ బోయపల్లి, సతీశ్రెడ్డి, శ్రీనివాస్ దగ్గుల, వినోద్ కోడూరు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులుగా ఎన్నికయ్యారు. బోర్డు ఏకగ్రీవంగా జయంత్ చల్లాను ప్రెసిడెంట్గా ఎన్నుకుంది. ఆటా బోర్డు 2023-24 ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా రామకృష్ణారెడ్డి అల (కార్యదర్శి), సతీశ్రెడ్డి (కోశాధికారి), తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి (జాయింట్ సెక్రెటరీ), రవీందర్ గూదూరు (జాయింట్ ట్రెజరర్), హరి ప్రసాద్ రెడ్డి లింగాల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)గా నియామకమయ్యారు. నూతన అధ్యక్షురాలు మధు బొమ్మినేని మాట్లాడుతూ భవిష్యత్ లక్ష్యాలు, ఆటా రోడ్ మ్యాప్ వివరాలను వెల్లడించారు.
సభ్యులంతా నిబద్ధత, ఐక్యత, బాధ్యతగా సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. అక్షరాస్యత, సాంస్కృతిక, విద్యా సామాజిక కార్యక్రమాలను ప్రోత్సాహం అందించాలనే ప్రాథమిక లక్ష్యాలకు ఆటా కట్టుబడి ఉంటుందన్నారు. యువతరాన్ని భాగస్వామ్యం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మధు బొమ్మినేని తెలిపారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సాహించడం, ఆటా కార్యకలాపాలు విస్తరణపై దృష్టి పెడుతామని, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పెంచుతామన్నారు. ఆటా సేవ, అవసరమైన వనరులతో మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలు కల్పించడం, సమాచార, ఆరోగ్య సేవల కార్యక్రమాలకు తన పదవీ కాలంలో మరింత ప్రాధాన్యతనిస్తామని మధు బొమ్మినేని వివరించారు.