హైదరాబాద్ : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (WAM) సింగపూర్ విభాగం అధ్వర్యంలో సింగపూర్ లో నివసిస్తున్న ఆర్య వైశ్యులు శ్రావణపౌర్ణమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా యజ్ఞోపవీతధారణ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
నల్ల భాస్కర్ గుప్తా, కంకిపాటి శశిధర్, ఉద్దగిరి సతీష్, వెంకట రమణ నంగునూరి, సంకా వెంకట రవికుమార్ సారధ్యంలో ధార్మిక విషయాలకు పెద్దపీట వేస్తూ వైదిక కార్యక్రమమైన జంధ్యాల పౌర్ణమి వేడుకలు నిర్వహించారు.
పురోహితులు శ్రావణ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం 12/08/2022 సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు జరిగినది. ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ.సనాతనధర్మాన్ని పాటిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించుకోవటం అభినందనీయమన్నారు.
జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమం కలశ స్థాపనతో మొదలై, గణపతి పూజ, గాయత్రి మంత్ర పఠనం ఇతర వేదమంత్రాలతో జరిగి చివరగా ఆశీర్వచనంతో ముగిసింది.
కార్యక్రమంలో వామ్ సింగపూర్ కమిటీ సభ్యులు కంచర్ల శరత్ బాబు కోట సతీష్, ఆనంద్, బివిఎస్ ప్రసాద్, ఫణి, నామ శ్రీపాద, కిషోర్ శెట్టి, నరేంద్ర ఆర్ఎస్, విజయ పడి, రామమోహన్, పాలెపు మల్లికార్జున, అప్పన చంద్ర గుప్తా, వుద్దగిరి భాను తదితరులు పాల్గొన్నారు.