హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో (South Africa) ఉన్న ప్రవాస భారతీయులు (NRI) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సౌతాఫ్రికాలో ఇండియాడే సందర్భంగా స్వతంత్ర సంబురాలలో ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (AASA) సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ అధ్యక్షుడు రాజు జయప్రకాశ్ కుప్పు మాట్లాడుతూ.. ఆనందోత్సాహాలతో 3 రోజులపాటు జరుపుకునే సంక్రాంతి, దసర పండుగలు హిందువుల ముఖ్యమైన పండుగలని చెప్పారు.
తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారని, పదో రోజున విజయ దశమిని అందరితో కలసి జరు దసరా వేడుకను జరుపుకుంటామన్నారు. ఈ పండగ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆశ సభ్యులు స్వతంత్ర సంబరాలలో ప్రదర్శన చేశారని తెలిపారు. కాగా, వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ప్రజలు హాజరయ్యారు. వారివారి రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించారు. ఆశ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.