హైదరాబాద్ : ‘ప్రవాస భారతీయుల దినోత్సవం’ భారతదేశ అభివృద్ధికి ప్రవాస భారతీయుల సహకారాన్ని గుర్తించడానికేనని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.
భారతదేశపు రిపబ్లిక్ ద్వారా జనవరి 9 న ఏటా జరిగే వేడుక రోజు ప్రవాస దినోత్సం అన్నారు.
జనవరి 9, 1915 న దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ తిరిగి ముంబైకి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు.
ఈ సందర్బంగా మహేష్ బిగాల మాట్లాడుతూ..భారతదేశ అభివృద్ధికి విదేశాల్లో ఉన్న భారతీయుల సహకారాన్ని, వారి ప్రాధాన్యాన్ని గుర్తించి గౌరవించుకోవడానికే ప్రతి ఏటా ‘ప్రవాస భారతీయుల దినోత్సవం’ జరుపుకుంటున్నామని తెలిపారు.
ప్రవాస భారతీయులు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు 50 పైగా వివిధ దేశాలలో చురుకుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలు విదేశాలలో ఉంటున్న తోట వారికి కరోనా సమయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేశారని గుర్తు చేసారు. ఈ సందర్బంగా ఎన్నారైల తరఫున ప్రవాస భారతీయుల దినోత్సవ శూభాకాంక్షలు తెలిపారు.