వరంగల్ : ఈనెల 6న వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరంగల్ రైతు సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా (BRS NRI Australia ) సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి ( Anil Baireddy ) పిలుపునిచ్చారు. రైతు సభను విజయవంతం చేయాలని రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించి 30 నెలలవుతున్న అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు చేసిన మోసాన్ని వరంగల్ నుంచి ఎండగట్టి రైతులను చైతన్యం చేసేందుకు రైతు సభను నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ నడిదే , రమేష్ ముత్యాల ,మధు పార్శ , సత్య గుండా, రవీందర్ చుక్క ,శ్రీకాంత్ రోహిత్ , హరీష్ రెడ్డి, సజ్జాద్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.