హైదరాబాద్: కెనడాలో దీపావళి (Diwali) సంబురాలు అంబరాన్నంటాయి. డుర్హం తెలుగు సంస్థ ఆధ్వర్యంలో ఒంటారియో రాష్ట్రంలో ఉన్న తెలుగు వారు దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కెనడా ఎంపీ ర్యాన్ టర్న్బుల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఎంతో నేర్పించిందన్నారు. కెనడా అభివృద్ధికి భారతీయులు కృషిచేస్తున్నారని చెప్పారు.
డీటీసీ అధ్యక్షుడు నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రమేశ్ ఉప్పలపాటి, డీటీసీ కార్యవర్గ సభ్యులు రవి మేకల, గౌతమ్ పిడపర్తి, శ్రీకాంత్ సింగిశెట్టి, వెంకట్ చిలువేరి, సర్ధార్ ఖాన్, కమల మూర్తి, భారీ సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.