హైదరాబాద్ : మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు మేరకు టీఆర్ఎస్ మలేషియా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మలేషియా శాఖ అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో కొవిడ్ నిబంధనల మేరకు జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా లైట్హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్లో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా చిన్నపిల్లల ఖర్చుల నిమిత్తం రూ.10వేలు చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్ సహాయ నిధికి అందజేశారు. కార్యక్రమంలో మలేషియా శాఖ ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేశ్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాథ్ నాగబండి, రవీందర్ రెడ్డి, హరీశ్ గుడిపాటి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.