హైదరాబాద్ : భారతదేశ ప్రగతి కోసం భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించిన సీఎం కేసీఆర్కు బీఆర్ఎస్ ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి ఒక దూరదృష్టి, వ్యూహాత్మక నాయకుడి అవసరం ఉందన్నారు. కేసీఆర్ లాంటి ప్రజ్ఞాశాలి, ప్రగతిశీల నాయకులు దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడు కరువయ్యాడని పేర్కొన్నారు. బీజేపీని ప్రశ్నించే దమ్ము కేవలం కేసీఆర్కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ లాగా దేశం కూడా అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని మహిపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.