లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి సుమారు 2 వేల మందికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యాక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు. వ్యాఖ్యాతలుగా ఉపాధ్యక్షులు సురేశ్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేశ్ కుప్పాల, కార్యదర్శి శైలజా జెల్ల వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటరీ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ( మైగ్రేషన్ & సిటిజన్ షిప్) సీమా మల్హోత్రా, మాజీఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్, అతిథులుగా కెన్సింగ్టన్ అండ్ చెల్సియా, డిప్యూటీ మేయర్ ఉదయ్ ఆరేటి, ఎంపీ కంటెస్టెంట్ ఉదయ్ నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, బంధన చోప్రా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ డైరెక్టర్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించారు. తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి బోనాల గొప్పదనం తెలియజేయడం ఎంతో స్ఫూర్తినిస్తుందని, బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలు, సంస్కృతులను ఆదరించే గొప్ప దేశమని, మనమంతా కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని ముఖ్య అతిథులు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం అయ్యేయి కృషి జరుగుతుందంటే దానికికారణం మన ప్రత్యేక రాష్ట్రం మనకు ఏర్పాటు అవడమేనని, కాబట్టి అన్ని సందర్భాల్లో రాష్ట్ర ఏర్పాటు కొరకై ముందుండి నాయకత్వం వహించిన ఉద్యమశిఖరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మనం అన్ని సందర్భాల్లో గుర్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే బోనాలు శుభాకాంక్షలు తెలిపి, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని కార్యవర్గాన్ని అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ ,తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచం లో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు.
సంస్థ ఉపాద్యక్షురాలు శుష్మణ రెడ్డి మాట్లాడుతూ.. టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.
ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ.. బోనాల జాతర ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం తన సహకారం, సూచనలు, స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నాం అని తేలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, ప్రవా తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు, బతుకమ్మ వేడుకల్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. టాక్ అడ్వైజరి చైర్మన్ మట్టా రెడ్డి మాట్లాడుతూ.. బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వయంత్రంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానికి సంస్థలకు మరియు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు కృతఙ్ఞతలు తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు. ఈ ఈవెంట్ స్పాన్సర్స్, అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీమ్ జ్ఞాపికలతో ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో టాక్ అద్యక్షులు రత్నాకర్ కడుదుల, శుష్మున రెడ్డి, సుప్రజ పులుసు, అశోక్ దూసరి, నవీన్ రెడ్డి ,గణేష్ కుప్పాల, పవిత్ర, సత్య చిలుముల, మట్టా రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిళి, రవి రేతినేని , రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్ జెల్ల, నాగ్, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్వేత, శ్రీ విద్య, నీలిమ, పృద్వి, మని తేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, జస్వంత్, మాడి, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.