హైదరాబాద్ : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకలు ఇంగ్లండ్లోని ఐలెస్బరీ(Aylesbury) ఘనంగా నిర్వహించారు. ఐలెస్బరీ తెలుగు సంఘం(ATC) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ, దసరా వేడుకలకు అంచనాలకు మించి 400 మంది హాజరయ్యారు. అక్టోబరు 16వ తేదీన మధ్యాహ్నం 4 గంటల సమయం నుంచి రాత్రి 10 గంటల సమయం వరకు కనుల పండువగా బతుకమ్మ ఉత్సవాలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వేడుకలో ఐలెస్బరీకి కొత్తగా ఎన్నికైన తెలుగు కౌన్సిలర్స్ హిమ బిందు గుండపుడి, ఫణిందర్ కొయ్య, జాన్ ఎండ్రపాటి లను సన్మానించారు. నిర్వాహకుల్లో ఒకరైన కొర్పోల్ రజనీష్ రెడ్డి మాట్లాడుతూ..మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ వేడకలు నిర్వహించడం సతోషంగా ఉందన్నారు.
ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించిన పల్లె శశిధర్ రెడ్డి, శ్రీధర్ సంగ, సురేష్ రాయపల్లి, కిషోర్ దమ్ముల, హిమబిందు గుండపుడి, నందిత మాలేపాటి, కళ్యాణి పల్లె, దీప విశ్వ మోహన్ లను అభినందించారు.