హైదరాబాద్: ఖతర్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖతర్లో భారత రాయబారి దీపక్ మిట్టల్ సతీమణి అల్పన మిట్టల్, భారత రాయబార కార్యాలయ అధికారి పద్మ కర్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల నుంచి తెప్పించిన అగ్గిపెట్టెలో ఇమిడే చీర, ఉంగరంలో పట్టే చీర, విదేశాల్లో తొలిసారిగా తెలంగాణ ఒగ్గు కథను ప్రదర్శించారు. తెలంగాణా జాగృతి కోసం ఏఆర్ రహమాన్ స్వర పరిచిన బతుకమ్మ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నందిని అబ్బగౌని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొన్నారు. బతుకమ్మ ఆడిన మహిళలు అనంతరం నిమజ్జనం చేసి సత్తుపిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
సంబురాల్లో ఐసీసీ అధ్యక్షులు పీ బాబు రాజన్, ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం హెబ్బగెలు,
ప్రధాన కార్యదర్శి కే కృష్ణ కుమార్, ఐసీసీ అడ్వైజర్ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ రావు కోడూరి, ఐసీబీఎఫ్ అధ్యక్షుడు జియాద్ ఉస్మాన్, ఉపాధ్యక్షుడు వినోద్ నాయర్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.