న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీలో (Indian army) టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారుకూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
మొత్తం ఖాళీలు: 40
ఇందులో అర్కిటెక్చర్ 1, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3, మెకానికల్ 5, కంప్యూటర్ సైన్స్ 8, ఐటీ 3, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ 1, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 1, టెలిక్యూనికేషన్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1, ఏరోనాటికల్ 1, ఎలక్ట్రానిక్స్ 1, ప్రొడక్షన్ 1, ఆప్టో ఎలక్ట్రానిక్స్ 1, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అర్హులు. అభ్యర్థులు 20 నుంచి 27 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. షార్ట్లిస్ట్ చేసినవారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
దరఖాస్తులకు చివరితేదీ: 2022, జనవరి 4
వెబ్సైట్: https://www.joinindianarmy.nic.in/