కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో మైనింగ్ సిర్దార్, గ్రేడ్ సీ టెక్నీషియన్ అండ్ సూపర్వైజరీ, డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్ అండ్ సూపర్వైజరీ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది. పదోతరగతి ఉత్తీర్ణులై.. మైనింగ్ సిర్దార్ సర్టీఫికెట్ ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకొండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ఉండగా.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 405 పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం ఖాళీలు : 405
పోస్టులు : మైనింగ్ సిర్దార్, గ్రేడ్ సీ టెక్నీషియన్ అండ్ సూపర్ వైజరీ, డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్ అండ్ సూపర్ వైజరీ
అర్హతలు : పదోతరగతి ఉత్తీర్ణులై.. మైనింగ్ సిర్దార్ సర్టీఫికెట్, పని అనుభవం ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : ఫిబ్రవరి 23
వెబ్సైట్ : https://secl-cil.in