న్యూఢిల్లీ: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఎల్) వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్షిప్ అందిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మార్కుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైన వారు మహారాష్ట్రలోని తారాపూర్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 250
ఇందులో స్టెనోగ్రాఫర్ 3, సెక్రటేరియల్ అసిస్టెంట్ 4, హౌస్ కీపర్ 3, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటేనెన్స్ 17, డ్రాట్స్మ్యాన్ 1, కార్పెంటర్ 14, ప్లంబర్ 15, వైర్మ్యాన్ 11, డీజిల్ మెకానిక్ 11, పెయింటర్ 15, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ 16, ఫిట్టర్ 26, టర్నర్ 10, మెషినిస్ట్ 11, ఎలక్ట్రీషియన్ 28, ఎలక్ట్రానిక్ మెకానిక్ 15, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 13, వెల్డర్ 21, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 14 చొప్పున ఉన్నాయి.
అర్హత: ఐటీఐ ఉత్తీర్ణులై 14 నుంచి 24 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 28
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 15
వెబ్సైట్: www.npcilcareers.co.in