న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన Jute కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 13లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 63 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అకౌంటెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 63
ఇందులో అకౌంటెంట్ 12, జూనియర్ అసిస్టెంట్ 11, జూనియర్ ఇన్స్పెక్టర్ 40 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఎంకామ్, డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. కంప్యూటర్పై ఇంగ్లిష్లో నిమిషానికి 40 పదాలు టైప్చేయగలగాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 31
దరఖాస్తులకు చివరితేదీ: 2022, జనవరి 13
వెబ్సైట్: https://www.jutecorp.in/