న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) కేడెట్ ఎంట్రీ స్కీంలో భాగంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. పర్మనెంట్ కమిషన్ కింద బీటెక్, ఐటీ ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టుల నియామకాలను చేపట్టింది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని ఎజిమళలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో శిక్షణ అందిస్తారు.
మొత్తం పోస్టులు: 85
ఇందులో ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ పోస్ట్ 30, ఎడ్యుకేషన్ 5, ఎస్సెస్సీ ఐటీ ఎగ్జక్యూటివ్ బ్రాంచ్ 50 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: 10+2 బీటెక్ ఎంట్రీ కోసం 10+2లో ఎంపీసీ గ్రూప్లో 70 శాతం మార్కులు సాధించాలి. అభ్యర్థులు 2003, జనవరి 2 నుంచి 2005, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎస్ఎస్సీ ఐటీ ఎగ్జిక్యూటివ్లకు 60 శాతం మార్కులతో పదో తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై.. 1997, జూలై 2 నుంచి 2003, జనవరి 1 మధ్య జన్మించినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: 10+2 బీటెక్ ఎంట్రీకి జేఈఈ మెయిన్ ర్యాంక్, ఇంటర్వ్యూ, మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 27
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 10
వెబ్సైట్: joinindiannavy.gov.in