న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మొత్తం 247 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 4 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 247
ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్ 67, ట్రైనీ ఇంజినీర్ 169, ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) 11 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ ఇయర్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్ రూ.500, ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 4
వెబ్సైట్: https://jobapply.in/BEL2022TETOPE లేదా https://www.bel-india.in/