డిచ్పల్లి, డిసెంబర్ 16 : తెలంగాణ యూనివర్సిటీ అంతర్ కళాశాలల వాలీబాల్ (ఉమెన్) టోర్నమెంట్-2022ను యూనివర్సిటీ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించినట్లు క్రీడా విభాగం డైరెక్టర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ టి.సంపత్ తెలిపారు. టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు క్రీడల్లో ముందుండాలని, క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడుతాయని తెలిపారు. రిజిస్ట్రార్ విద్యావర్ధిని మాట్లాడుతూ.. వర్సిటీలో టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన క్రీడను ఎంపిక చేసుకొని ప్రతిరోజూ ప్రాక్ట్టీస్ చేయాలని సూచించారు.
టోర్నమెంట్లో గెలుపొందిన టీమ్కు రిజిస్ట్రార్ షీల్డ్, సర్టిఫికెట్లను అందజేశారు. టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొనగా మొదటి బహుమతి ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల -బాన్సువాడ, ద్వితీయ బహుమతి టీఎస్డబ్ల్యూఆర్డీసీ (ఉమెన్)-ఆర్మూర్ కళాశాలలు గెలుచుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజయ్య, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆరతి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బాలమణి, హైమావతి, వర్షిణి, స్వప్న, అరుణ కుమారి, వెంకటేశ్గౌడ్, వర్సిటీ క్రీడావిభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ బీఆర్ నేత, క్రీడాకారిణులు పాల్గొన్నారు.