నిజామాబాద్ క్రైం, జనవరి 4 : ఆధిపత్య పోరులో భాగంగానే రౌ డీ షీటర్ ఇబ్రహీం చావూస్ అలియాస్ జంగల్ ఇబ్బు (32) హత్యకు గురయ్యాడని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపా రు. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీ లో ఉన్నారని తెలిపారు. సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్తో కలిసి బుధ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. షేక్ అర్షద్ అనే వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల ఒకటో తేదీన బషీర్ ఫామ్ హౌస్కు రౌడీ షీటర్లు జంగల్ ఇబ్బు, డాన్ ఆరిఫ్లను ఆహ్వానించారు.
తాము కబ్జా చేసిన ప్రభు త్వ భూమిలో వాటా కావాలంటూ వేధింపులకు పాల్పడుతున్నాడని, దీంతో అతడిని అడ్డుతొలగించుకోవడం కోసం ప్రత్యర్థులు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇబ్బును అక్కడకు రప్పించారు. దీంతో ఇద్దరు రౌడీ షీటర్లు తమ గ్యాంగ్ సభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అనంతరం అక్కడ ఉద్దేశపూర్వకంగా ఇబ్బుతో ఆరిఫ్ గొడవకు దిగాడు. ఇదే అదునుగా చూసి సయ్యద్ ఆరిఫ్, అమేర్ ఖాన్ తమ వెంట తెచ్చుకున్న కత్తులు, తల్వార్లతో ఇబ్బును పొడిచారు. అనంతరం సునర్ అమ్జా త్ తదితరులు అతని ముఖంపై బండరాళ్లతో కొట్టి చంపారు.
నాలుగు రోజులుగా పరారీలో ఉన్న నిందితులను ఈ రోజు సౌత్ రూరల్ సీఐ నరేశ్ ఆధ్వర్యంలో ఎస్సై సాయికుమార్, లింబాద్రి, మహేశ్ తమ సిబ్బంది తో కలిసి అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ ఆరిఫ్, అమీర్ అలీ ఖాన్, మహ్మద్ ఎజాజ్ హైమద్, షేక్ అమ్జాద్, షేక్ ఖదీర్, షేక్ మోహీజ్, మిర్జా ఖజా బేగ్, సయ్యద్ ముదాసీర్, షేక్ నదీమ్, షేక్ ఆర్షద్, అబ్దుల్ ఫజల్, ఇర్ఫాన్ ఖాన్ను అరెస్టు చేసి, వారివద్ద నుంచి మారణాయుధాలు స్వా ధీనం చేసుకొని రి మాండ్కు తరలించారు. మరో ముగ్గురు సయ్యద్ ఉస్మా న్, రైమాన్, నబీ పరారీలో ఉన్నారని ఏసీపీ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి కారు, బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 48 గంటల్లో కేసు ఛే దించిన సిబ్బందిని సీపీ నాగరాజు అభినందించారని తెలిపారు. సమావేశంలో ఎస్సైలు సాయికుమార్, లింబాద్రి, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.