రేషన్ షాపుల ఎదుట జనం బారులు తీరుతున్నారు. వాస్తవానికి ఈ నెల బియ్యం పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ వస్తున్న తరుణంలో ప్రజలు బియ్యం కోసం రేషన్షాపుల ఎదుట క్యూ కడుతున్నారు. బుధవారం రాత్రి సమయంలోనూ నిజామాబాద్ నగరంలోని దుబ్బరోడ్లో గల ఓ షాపు ఎదుట పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు బారులు తీరి కనిపించారు.