నిజాంసాగర్, డిసెంబర్ 6: మొన్నటి వరకు కరోనా కారణంగా వాణిజ్య, వ్యాపార సముదాయాలు దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. లాక్డౌన్తో అస్తవ్యస్తంగా మారిన వ్యాపారాలు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండగా కేంద్ర ప్రభుత్వం చిరువ్యాపారులపై మరో మారు సిలిండర్ల రూపంలో భారం వేసింది. ఈ నెల ఒకటో తేదీన 19 కిలోల వాణిజ్య సిలిండర్పై రూ.103 పెంచడంతో ప్రస్తుతం రూ.2310 చేరుకున్నది. దీంతో గడిచిన మూడు నెలలుగా పెరుగుతున్న ధరలు వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా టీ కొట్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, బజ్జీ దుకాణాల నిర్వాహకులపై అధికభారం పడుతుండడంతో వారు కూడా ధరలు పెంచక తప్పడం లేదు. ఈ భారమంతా చివరకు వినియోగదారులపై పడుతోంది. మూడు నెలల్లో సిలిండర్ ధర రూ.484పెరగడంపై అటు వ్యాపారు లు, ఇటు సామాన్యులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో..
వాణిజ్య సిలిండర్ ధర రూ.2207 ఉండగా ఈ నెల ఒకటో తేదీన పెంచి న ధరతో నూ.2310కి చేరింది. ధర పెంపుతో పాటు గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం రాయితీని తొలగించింది. సా ధారణంగా టిఫిన్ సెంటర్లు, హోటళ్లకు నెలకు సుమారు మూడు నుంచి నాలుగు వరకు సిలిండర్లు అవసరం. ఈ లెక్క న నెలకు రూ.1500 వరకు అదనపు భారం వ్యాపారులపై పడనున్నది.
రెండు నెలలుగా అందని సబ్సిడీ
రెండు నెలలుగా గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్కు కేంద్రం సబ్సిడీని ఇవ్వడంలేదు. ప్రస్తుతం సిలిండర్ ధర 971.50 ఉండగా అందులో కేంద్ర ప్రభుత్వం తిరిగి వినియోగదారుడికి సబ్సిడీ రూపంలో రూ. 40 చెల్లించాలి. కానీఅక్టోబర్, నవంబర్ నెలల్లో ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు జమ కాలేదు. కేంద్రం సామాన్యులపై మోపుతున్న భారంతో ప్రజలు గ్యాస్ను వినియోగించుకోవాలంటేనే జంకుతున్నారు.
ఇలాగైతే కష్టం..
అసలే గిరాకీలు తక్కువ ఆపై సిలిండర్ ధరను మూడు నెల ల్లో రూ.484కు పెంచింది. ప్ర స్తుతం ఒక్క సిలిండర్ ధర రూ.2310కు చేరడంతో ఖర్చు లు పోనూ మిగిలే పరిస్థితి లేకుండా పోతున్నది. కేంద్రం వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తేనే మా లాంటి చిరు వ్యాపారులకు కుటుంబం గడిచేది.
-శివ, ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు,
నిజాంసాగర్