ధర్పల్లి, మార్చి 27 : మండలంలోని ప్రాజెక్టు రామడుగు సొసైటీ చైర్మన్ ధర్మయ్యగారి రాజేందర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈనెల 4న సొసైటీకి చెందిన ఏడుగురు డైరెక్టర్లు చైర్మన్పై అవిశ్వాసం ప్రకటిస్తూ డీసీవో శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన సొసైటీ పాలకవర్గ సభ్యులందరికీ ఈనెల 11న నోటీసులు ఇవ్వగా.. దాని ప్రకారం బుధవారం రామడుగు గ్రామంలోని సొసైటీ కార్యాలయంలో పోలీసు బందోబస్తు మధ్య అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశం ప్రారంభమైనప్పటికీ ఒక్క డైరెక్టర్ కూడా హాజరుకాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు డీసీవో ప్రకటించారు. ప్రస్తుత చైర్మన్ రాజేందర్రెడ్డి పాలన కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చని డీసీవో స్పష్టం చేశారు. సమావేశంలో రామడుగు సొసైటీ కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, ధర్పల్లి సొసైటీ కార్యదర్శి సంతోష్రెడ్డి, గంగనర్సయ్య, సీఐ భిక్షపతి, ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు.