నిజామాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన జరుగనున్నది. ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలు ఏర్పాటు చేశా రు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ పని చేస్తుంది. ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఏర్పాటైంది. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుని సీనియారిటీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనను చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగానే విభజన ఉంటుంది. దివ్యాంగులు, పిల్లల్లో మానసిక దివ్యాంగులు ఉన్న ఉద్యోగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎన్నికల కోడ్ లేకపోవడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
ఎక్కడి ఉద్యోగాలు అక్కడి వారికే…
రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానంతో ఉద్యోగ నియామకాలు జరగలేదు. విద్యాపరంగా సైతం ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాల్లో రెండు జోన్లు, 10 జిల్లాల విధానం కిందనే వీటిని చేపట్టారు. కొత్త జోనల్ విధానం ఆమోదం పొందడం తో ఇకపై జరిగే ఉద్యోగ నియామకాలు దీని కిందనే జరుగనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆర్డర్ టు సర్వ్ విధానంలో ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. నూతన వ్యవస్థ ఆమోదంతో ఇక మీదట జిల్లాలు, జోన్ల వారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు కానున్నది. దీని ఆధారంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల ప్రక్రియ జరుగుతుంది. కొత్తగా నియమితులైన వారికి సైతం జోనల్ కేటాయింపులు సులభం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రం లో కొలువుల భర్తీ ప్రక్రియ అంతా తెలంగాణ ప్రాంత అవకాశాలను కొల్లగొట్టేలా జోనల్ వ్యవస్థ ను రూపొందించారు. ఆంధ్రులు అనేక కుట్రలతో పోస్టులను భర్తీ చేసేవారు. జోనల్ సిస్టంలో శాస్త్రీయత లోపించడంతో ప్రత్యేకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖాళీల భర్తీకి ఎక్కడెక్కడి నుంచో అభ్యర్థులు వచ్చి పోటీపడే వారు. తద్వారా స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక గల్ఫ్ బాట పట్టే దుస్థితి ఏర్పడింది. పోలీసు కొలువుల్లోనూ ఇదే తంతు జరిగేది. నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి అనేకులు మన వారికి పోటీకి వచ్చేవారు. తద్వారా స్థానికత అనేది కనిపించకపోయేది. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో చిన్న జిల్లాలతో ఏర్పాటైన జోనల్ వ్యవస్థలో స్థానికులకే ఉద్యోగాలు దక్కనున్నాయి.
కాలగర్భంలో పాత జోనల్ వ్యవస్థ…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలైన జోనల్ వ్యవస్థ పాత జిల్లాల ప్రకారం అమలైంది. ఐదు, ఆరో జోన్ ప్రాతిపదికన కొనసాగిన వ్యవస్థ ఈ ఏ డాది ప్రారంభంలోనే రద్దు చేయబడింది. సర్కారు కొలువుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వ చ్చిన నూతన జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆ మోదం తెలపడంతో పాత జోనల్ వ్యవస్థ కనుమరుగైంది. తెలంగాణ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చిన పాత జోనల్ వ్యవస్థ కాలగర్భంలో కలిసి పోయింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ లోని (1) (2) క్లాజ్లను అనుసరించి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్) ఆర్డ ర్ 2018 ప్రకారం రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లు ఆవిర్భవించాయి. మల్టీ జోన్-1లో నాలుగు జోన్లను విభజించారు. మల్టీ జోన్-2లో మూడు జోన్లు ఉన్నాయి. ఉమ్మ డి నిజామాబాద్ జిల్లా పరిధి మొత్తం మల్టీజోన్-1లో చేరింది. కాకపోతే జోన్ల వారీగా విభజించినప్పుడు రెండు జిల్లా లు వేర్వేరు జోన్లలో చేరిపోయాయి. జోన్-1గా కాళేశ్వరం, జోన్-2గా బాసర, జోన్-3గా రాజ న్న, జోన్- 4గా భద్రాద్రి ఉన్నాయి. ఈ నాలుగు జోన్లను మల్టీ జోన్- 1 పరిధిలో చేర్చారు. జోన్- 5గా యాదాద్రి, జోన్ -6గా చార్మినార్, జోన్- 7 గా జోగులాంబలను మల్టీ జోన్-2లో సర్దుబాటు చేశారు. నూతన జోనల్ వ్యవస్థతో జోన్-2 బాసర పరిధిలోకి నిజామాబాద్ జిల్లా చేరింది. ఇందులో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జి ల్లాలు ఉన్నాయి.జోన్-3 రాజన్న పరిధిలోకి కా మారెడ్డి జిల్లా చేరింది. ఇందులో కరీంనగర్, రాజ న్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి.
ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ ఇలా…
జిల్లా క్యాడర్లో టైపిస్టు, జూనియర్ అసిస్టెం ట్, జూనియర్ స్టెనో, డ్రైవర్, రికార్డు అసిస్టెం ట్, రెనో ఆపరేటర్, జమేదార్, చైన్మెన్, దఫేదార్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్, స్వీపర్, వాచ్మెన్, ఫోర్మెన్, కార్పెంటర్, మేస్త్రీ, గార్డెనర్, చౌకీదార్, ప్రింటింగ్ టెక్నీషియన్, కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 తదితర పోస్టులన్నింటినీ నిర్ధారించారు. జోనల్ క్యాడర్లో నాయబ్ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఎంఆర్ఐ, ఏఆర్ఐ, సీనియర్ స్టెనోగ్రాఫర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సూపరింటెండెంట్, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, సీనియర్ డ్రైవర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1,2,3, సబ్ రిజిస్టార్ గ్రేడ్-2 పోస్టులున్నా యి. మల్టీ జోనల్ పోస్టుల పరిధిలో డిప్యూటీ కలెక్టర్(ఆర్డీవో), అసిస్టెంట్ సెక్రటరీ, సూపరింటెండెంట్, తహసీల్దార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సీఐ, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ -1, 2, అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, హెల్త్ ఇన్స్ట్రక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజినల్ పంచాయతీ ఆఫీసర్, ఎంపీడీవో, మండల పం చాయతీ అధికారి, అగ్రికల్చర్ అధికారి, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్- 1, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్లు గ్రేడ్ -2, 3 అధికారులున్నారు.