నిజామాబాద్ : జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి ఘనస్వాగతం లభించింది. నిజామాబాద్ సరిహద్దు ప్రాంతం ఇందల్వాయి నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వందలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
మాధవ నగర్ వద్ద జీవన్ రెడ్డికి భారీ గజమాలతో కార్యకర్తలు సత్కరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ మైదానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేకును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి జీవన్ రెడ్డి కట్ చేశారు.