డిచ్పల్లి, ఫిబ్రవరి 7 : కేసీఆర్తోనే పల్లెల అభివృద్ధి జరుగుతున్నదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని రాం పూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. రూ.7 కోట్ల 56 లక్షలతో చెక్డ్యామ్, పశువైద్యశాల, వృద్ధాశ్రమ భవనం, శ్మశాన వాటిక, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు, డ్రైనేజీ, కులసంఘాల భవనాలతో పా టు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బాజిరెడ్డి మా ట్లాడుతూ రాంపూర్ గ్రామానికి ఇన్ని నిధులు వ చ్చాయంటే సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్ కృషితోనే అని అన్నారు.
కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అమలు చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం అప్పులమయంగా మార్చిందే తప్ప ఏ ఒక్క గ్రామానికైనా నిధులు ఇచ్చిందా అని ప్రశ్నించారు. అదేవిధంగా మన జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఏ గ్రామానికైనా నిధులు మంజూరు చేసి న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్పై మాట్లాడడం తప్ప అ భివృద్ధిపై దృష్టి లేదన్నారు. ప్రధాని అదాని, అంబా ని కనుసైగల్లో నడుస్తూ దేశ ప్రజలను మాయ చేస్తున్నారన్నా రు. గ్రామాల్లోని ప్రజలు సీఎం చేస్తున్న అభివృద్ధి పనులను గమనించాలన్నారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో రూరల్ నియోజకవర్గ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రూరల్లో ఇప్పటి వరకు మంచిప్ప ప్రాజె క్టు కోసం రూ.2,600 కోట్లు, రూర ల్ అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే సీఎం కేసీఆర్కు ఎప్పుడూ మద్దతు ఇవ్వాలని అన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
గ్రామంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్ రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తాననడం, ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని విధంగా ఇంత పెద్ద బడ్జెట్ను ప్రవేశపెట్టడం సీఎం కేసీఆర్తోనే జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్మోహన్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, ఎంపీపీ రమేశ్ నాయక్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్రెడ్డి, లోలం సత్యనారాయణ, మండల రైతు కో ఆర్డినేటర్ జీనియస్ నారాయణరెడ్డి, సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సాయిలు, సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ సుజాతా రవి, మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, నాయకులు కుమ్మరి గంగాధర్, ప్ర మోద్, రఘునందన్రావు, గణేశ్, చాకలి సాయి లు, నర్సయ్య, యువజన సంఘ నాయకులు, వీడీసీ కమిటీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.