Dharpalli | ధర్పల్లి, ఆగస్టు 27 : ధర్పల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క సైరవిహారం చేసి కనిపించిన వారినెల్ల కరిచిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ మూడు గుడిసెల తండా వద్ద కేజీబీవీకి సమీపంలో పలుచోట్ల పిచ్చికుక్క తిరుగుతూ రోడ్డు వెంట కనిపించిన వారి నల్ల కరవడం మొదలుపెట్టింది. దీంతో రోడ్డుపెంట నడిచే ప్రజలు బాధితులు భయాందోళనలతో పరుగులు తీశారు.
బాధితులు ఆరుగురు మండల కేంద్రంలోని ప్రభుత్వ దావకానకు చేరుకోగా స్టాఫ్ నర్స్ సుజాత వారికి ప్రథమ చికిత్సలు అందించారు.. అయితే మండల కేంద్రంలో గతంలో పిచ్చికుక్క ఇలాగే స్వైర విహార చేసి సుమారు 14 మందిని కరవగా మరోసారి ఇలాంటి సంఘటన చోటుచేసుకున్నాయి. దీంతో మండల కేంద్రంలోని ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోని కుక్కల బెడదను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.