డిచ్పల్లి, జనవరి 29: డిచ్పల్లి వైస్ ఎంపీపీ కులాచారి శ్యాంరావుపై ఎంపీటీసీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలంలో ఆర్డీవో రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో సోమవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించగా.. మొత్తం 17 మంది ఎంపీటీసీలకు 13 మంది హాజరయ్యారు. ఆర్డీవో బలపరీక్ష నిర్వహించగా.. వైస్ ఎంపీపీ శ్యాంరావుకు వ్యతిరేకంగా 13 మంది ఎంపీటీసీలు చేతులు పైకెత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు. అనంతరం ఆర్డీవో విలేకరులతో మాట్లాడుతూ..
ఎంపీపీ భూమన్న అవిశ్వాస తీర్మానంపై హైకోర్టు నుంచి స్టే తీసుకురావడంతో ఉదయం 10.30 గంటలకు జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశామని తెలిపారు. వైస్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానంపై సమావేశాన్ని 11.30 గంటలకు నిర్వహించినట్లు చెప్పారు. మెజార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారని, దీనిపై నివేదికను కలెక్టర్కు అందజేస్తామని ఆర్డీవో తెలిపారు. సమావేశంలో డిచ్పల్లి ఎంపీడీవో టీవీఎస్ గోపీబాబు, ఎంపీటీసీలు చిన్నోల్ల నర్సయ్య, దండుగుల సాయిలు, ఉగ్గెర కృష్ణవేణి, పులి నర్సింగ్రావు, చాకటి రాజమణి, కుర్రి సవిత, దుంపాల సౌమ్య, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.