నిజామాబాద్ క్రైం, జనవరి 11: కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని, మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఆయన సీపీ కేఆర్ నాగరాజు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కంగ్ సిస్టంలో పోలీస్ స్టేషన్ల వారీగా ఎఫ్ఐఆర్లు, కేసులకు సంబంధించిన వివరాలను పొందుపర్చాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్నచిన్న నేరాలకు సైతం అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలో పెట్రోలింగ్ను ముమ్మరం చేసి ప్రత్యేక బీట్లను ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. ఎన్బీడబ్ల్యూ కేసులపై డివిజన్ పరిధిలో టీములను ఏర్పాటు చేసి త్వరగా ఎగ్జిక్యూట్ చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పోలీస్ కళాబృందాల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. పాత నేరస్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్బాబు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు వెంకటేశ్వర్లు, రఘు, రామారావు, ప్రభాకర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.